మూసీ న‌దికి శాంతి పూజ‌

406
moosi river
- Advertisement -

మూసీ నదికి రాష్ట్ర ప్రభుత్వం శాంతి పూజ నిర్వహించింది. 1908 తర్వాత మూసి నదికి ఇప్పుడు మళ్లీ శాంతిపూజ నిర్వహించారు.పురానాపూల్ మూసీ నది వ‌ద్ద‌ గంగ‌మ్మ త‌ల్లికి బోనం, ప‌ట్టువ‌స్ర్తాలు, ప‌సుపు, కుంకుమ‌, పూలు స‌మ‌ర్పించారు. అనంతరం అక్క‌డున్న ద‌ర్గాలో ప్రజాప్రతినిధులు చాదర్ స‌మ‌ర్పించారు. ఈ పూజా కార్య‌క్ర‌మంలో మంత్రులు శ్రీ మహమూద్ అలీ, శ్రీ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మేయ‌ర్ శ్రీ బొంతు రామ్మోహ‌న్‌, డిప్యూటీ మేయ‌ర్ శ్రీ బాబా ఫ‌సీయుద్దీన్‌తో పాటు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

- Advertisement -