రామమందిర నిర్మాణానికి షారుఖ్ విరాళం..క్లారిటీ!

241
sharukh
- Advertisement -

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ విరాళం అందించారన్న వార్త బీ టౌన్‌లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. షారుఖ్ రూ.5 కోట్ల విరాళం అందించారనే వార్తలు వెలువడుతుండగా వాటిపై క్లారిటీ ఇచ్చింది షారుఖ్ కంపెనీ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్. షారుఖ్‌ 5 కోట్లు ఇచ్చారనే వార్తల్లో ఎలాంటి నిజంలేదని స్పష్టం చేసింది.

శతాబ్దాల కలను నెరవేరుస్తూ ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. శ్రీరామ చంద్రమూర్తి జన్మస్థలమైన అయోధ్యాపురిలో రామ మందిరం నిర్మించాలనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల చిరకాల కోరిక‌. మూడున్నర సంవత్సరాల్లో రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు.

- Advertisement -