టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు..

167
- Advertisement -

శనివారం సిద్దిపేట జిల్లా వీణవంక మండలం దేశాయిపల్లి, నర్సింగాపూర్ గ్రామాల నుంచి దాదాపు 150 మంది ఇతర పార్టీల కార్యకర్తలు మంత్రి హారీష్‌ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారిని గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి హరీష్‌ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండేలా పని చేస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులను బలపరుద్దాం. కులవృత్తులను బలోపేతం‌ చేసేలా‌ సీఎం‌ కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.

గొల్ల కురుమలకు గొర్రెలు, మత్స్యకారులకు చేప పిల్లల ఉచితంగా పంపిణీ చేశారు. రైతుకు రైతు బంధు, రైతు బీమా, సకాలంలో విత్తనాలు, ఎరువులు వంటివి పంపిణీ చేసి రైతును రాజుగా మార్చారు. ఒకప్పుడు తెలంగాణ అంటే ఆత్మహత్యలు, ఆకలి కేకలు, వలసలు.. నేటి తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారింది. దేశంలో అత్యధికంగా వరి పంట పండించే పంజాబ్‌ను వెనక్కు నెట్టి, తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. యాసంగిలో‌౩ కోట్ల మెట్రిక్‌ టన్నుల‌ వరిపంట పండించి ‌తెలంగాణ దేశంలో తొలి స్థానంలో నిలిచింది. ఇది‌ సీఎం‌ కేసీఆర్ దూరదృష్టి, ప్రణాళిక వల్లే సాధ్యమయిందన్నారు మంత్రి.

ఇది అవుతుందా అన్న కాళేశ్వరం ప్రాజెక్టు ‌రికార్డ్ సమయంలో పూర్తి చేసి రైతన్నకు సాగు నీటి‌కొరత లేకుండా‌‌ చేశారు. కాళేశ్వరం తొలి ఫలితం అందుకున్న నియోజకవర్గం హుజూరాబాద్. నేడు ఈ నియోజకవర్గానికి ఎన్నికలు ఎందుకు వచ్చాయో మీకు తెలుసు. తన స్వార్థం‌ కోసం ఈటల రాజేందర్ రాజీనామా వల్ల ఈ ఎన్నికలు వచ్చాయి. మంత్రిగా పేదల‌ కోసం ఒక్క ఇళ్లు కట్టని ఈటల గెలిస్తే, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఇళ్లు నిర్మించి ఇస్తారా.. వ్యక్తి ప్రయోజనమా.. హుజూరాబాద్ ప్రజల ప్రయోజనాలా.. మీరే ఆలోచించండి అన్నారు. నిరంతరం మీ కోసం పని చేసే‌ సీఎం కేసీఆర్ గారికి హుజూరాబాద్ గెలుపు కానుకగా ఇద్దాం.. హుజూరాబాద్ని అభివృద్ధి చేసుకుందాం. గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. మీ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా అని మంత్రి హరీష్‌ హామీ ఇచ్చారు.

- Advertisement -