బీజేపీకి భారీ షాక్.. కారెక్కిన కీలక నేతలు..

71
trs
- Advertisement -

దేశాన్ని అధోగతి పాలు చేస్తూన్న మోడీ ప్రభుత్వం ఒక వైపు… తెలంగాణలో సుపరిపాలన అందిస్తూ దేశానికే గర్వకారణంగా టిఆర్ఎస్ ప్రభుత్వం మరోవైపు.. ఇంత మంచి పాలన అందిస్తున్న తెలంగాణా సర్కార్‌పై విషం చిమ్మటానికి వచ్చిన అమిత్ షాకు ఇక్కడ స్తానం లేదని,స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టిఆర్ఎస్ కె మా మద్దతు అని గుజరాత్ గులాముల పార్టీ బీజేపీకి రాజీనామా చేశామని పులి మామిడి బీజేపీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో కందుకూరు మండల పులి మామిడి సర్పంచ్ అనిత శ్రీనివాస్,వార్డు సభ్యులు,బీజేపీ పార్టీ కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

శ్రీనగర్ కాలనీలోని మంత్రి నివాసంలో పెద్ద ఎత్తున అనుచరులతో టిఆర్ఎస్‌లో చేరిన బీజేపీ సర్పంచ్‌ను టిఆర్ఎస్ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే తెలంగాణా అభివృద్ధి సాధ్యమని నమ్మి టిఆర్ఎస్ పార్టీలో చేరటానికి ముందుకు వస్తున్న వారికి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు.

- Advertisement -