టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ నేతలు..

100
- Advertisement -

సీఎం కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి కీలక నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎప్‌ పార్టీ చేరుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో సుమారు 200 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పెన్ పహడ్ మండలం ఎన్‌ అన్నారం బీజేపీ సర్పంచ్ ధనియాకుల కోటమ్మ సత్యనారాయణ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి మంత్రి జగదీష్‌ రెడ్డి గులాబి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.

- Advertisement -