తెరపైకి రాంచరణ్ ‘రంగస్థలం’ సీక్వెల్..?

150
- Advertisement -

టాలీవుడ్ డైరెక్టర్‌ సుకుమార్ – రాంచరణ్ కాంబినేషన్లో 2018 మార్చిలో వచ్చిన ‘రంగస్థలం’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చిట్టిబాబు పాత్రలో చరణ్ జీవించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని సుకుమార్ – చరణ్ ఇద్దరూ కూడా నిర్ణయించుకున్నారని సమాచారం. ఇక చరణ్ ఒక వైపున ‘ఆర్ ఆర్ ఆర్’ .. మరో వైపున ‘ఆచార్య’ సినిమా పనులను చక్కబెడుతూ వస్తున్నాడు.

ఈ రెండు సినిమాల తరువాత ఆయన శంకర్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తరువాత చరణ్ .. సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమాకి సీక్వెల్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. మరోవైపు శంకర్ సినిమాను చరణ్ పూర్తి చేసేలోగా, విజయ్ దేవరకొండతో సినిమాను సుకుమార్ పూర్తిచేస్తాడు. ఆ తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

- Advertisement -