కమెడియన్‌ అలీ @40..

266
Ali
- Advertisement -

బాల నటుడిగా, కమెడియన్‌‌గా, హీరోగా, యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ నటుడు అలీ టాలీవుడ్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకు న్నారు. 1979 లో ‘ప్రెసిడెంట్ పేరమ్మ’ చిత్రం ద్వారా బాల నటునిగా సినీ రంగ ప్రవేశం చేసిన అలీ ఈ సంవత్సరంతో నటుడిగా 40 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఇక 1981లో విడుదలైన ‘సీతాకోకచిలుక’ చిత్రం ద్వారా బాలనటుడిగా అలీ వెలుగులోకొచ్చాడు. ఈ చిత్రానికి బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నాడు.

‘జంబలకిడి పంబ’, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, హలో బ్రదర్, ‘ముద్దుల ప్రియుడు’, ‘శుభలగ్నం’ తదితర చిత్రాల్లో హాస్యటుడిగా నటించాడు. 1994లో వచ్చిన ‘యమలీల’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ‘అమ్మాయి కాపురం’, ఘటోత్కచుడు, ‘పిట్టలదొర’ చిత్రాల్లోనూ హీరో పాత్రల్లో నటించాడు.

Ali

అయితే అలీ 40 ఏళ్ల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను ప్రముఖ సాంస్కృతిక సంస్థ ‘సంగమం’ వారు ఘనంగా సత్కరించ నున్నారు. అలీ నాలుగు దశాబ్దాల సినీ జీవిత మహోత్సవం కార్యక్రమాన్ని ఫిబ్రవరి 23వ తేది శనివారం సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని శ్రీ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆడిటోరియంలో నిర్వహించనున్నది.

ఈ విశేష కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్టు సంగమం సంస్థ వ్యవస్థాపకులు ఓ ప్రకటనలో తెలిపారు. అలీ 40 ఏళ్ల సినీ జీవిత మహోత్సవ కార్యక్రమానికి ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్, సినీరంగ ప్రముఖులు కే రాఘవేంద్రరావు, శ్రీ అశ్వినీదత్, శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు అతిథులుగా పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో అలీకి స్వర్ణకంకణం తొడిగి ఘనంగా సత్కరించబోతున్నారు.

- Advertisement -