హిజ్రాలకు సాయం చేసిన ప్రముఖ డైరెక్టర్‌..!

216
Sekhar kammula help to poor people
- Advertisement -

లాక్ డౌన్ నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్‌ శేఖర్ కమ్ముల తన మంచి మనసు చాటుకున్నాడు. ఆయన ఈ కష్టకాలంలో హిజ్రాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కొంతమంది హిజ్రాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అంతేకాదు, వీరికి సాయం చేయడానికి ఇతరులు కూడా ముందుకు రావాలని శేఖర్ కమ్ముల పిలుపునిచ్చారు. అంతేకాదు ఈ ఫిదా డైరెక్టర్‌ ఇప్పటికే జీహెచ్ఎంసీ, కర్నూలు పారిశుద్ధ్య కార్మికులకు మజ్జిగ, బాదంపాలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ.. ట్రాన్స్ జెండర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని… వారి కష్టాలను మనం ఊహించలేమని అన్నారు. ఉండటానికి ఇల్లు లేక, అద్దెలు కట్టుకోలేక, తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం చూపే వివక్ష వారి బాధలను మరింతగా పెంచుతోందని చెప్పారు. మరోవైపు తమకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన శేఖర్ కమ్ములకు హిజ్రాలు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -