ఆ వార్తతో షాకైన రకుల్‌…..

287
Seerat Kapoor fan's blood love
- Advertisement -

టాలీవుడ్‌లో ఈ ఏడాది రకుల్‌ ప్రీత్‌సింగ్‌ దుమ్మురేపుతొంది. ఆమె నటించిన మూడు సినిమాలు ఈసంవత్సరం బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఎన్టీఆర్‌తో నటించిన నాన్నకు ప్రేమతో…అల్లుఅర్జున్‌ సరైనోడు….రాంచరణ్‌ ధృవ ఈ మూడు సినిమాలు బాక్స్‌ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. టాలీవుడ్‌లో స్టార్‌ స్టేటస్‌ ఎంజాయ్‌ చేస్తూ దూసుకుపోతున్న రకుల్‌ప్రీత్‌సింగ్‌కు 2016 ఈయర్‌ ఎండింగ్‌లో షాక్‌ గురైందట.

Rakul Preet Singh

ఆ షాక్‌ ఏంటంటే,… రక్తంతో రాసిన ప్రేమలేఖను చూసి ఆమె షాక్‌ గురైందట. అయితే అది రకుల్‌కు వచ్చిన లవ్‌ లెటర్‌ కాదు. ఓ వీరాభిమాని రన్‌రాజా ఫేం హీరోయిన్‌ సీరత్‌కపూర్‌కు రక్తంతో లవ్‌ లెటర్‌ రాశాడు. ఇది చూసిన రకుల్‌ కాస్త దిగ్భాంతికి లోనైంది. అభిమానం హద్దులు దాటితే ఉన్మాదంగా మారుతుందని. స్టార్‌హీరోలను, హీరోయిన్లను ఇలా వెర్రిగా అభిమానించే ఫ్యాన్స్‌ ఒక్కోసారి ఉన్మాదులుగా మారుతున్నారని….రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Seerat Kapoor

సీరత్‌ కపూర్‌ పై తనకున్న ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేస్తూ రక్తంతో ప్రేమలేఖ రాశాడు ఓ వీరాభిమాని. ఆ వీరాభిమాని చేసిన ఈ పని తనకు ఎంతో ఆవేదన కలిగించిందని, దయచేసి ఇలాంటి పనులు చేయవద్దని ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేసింది సీరత్‌. ముందుగా మీ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చుకోవాలని, తర్వాతే ఇతరులను అభిమానించాలని హితువు చెప్పింది. హీరోహీరోయిన్లపై అభిమానంతో మీకు మీరు హాని తలపెట్టుకోవద్దని నటుల అందరి తరపునా ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌కు స్పందించిన రకుల్.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ‘ఇది చాలా దారుణం. ప్రతి వ్యక్తి తనను తాను గౌరవించుకోవాలి. జీవితం చాలా విలువైనది’ అని రీ ట్వీట్ చేసింది.

- Advertisement -