విత్తన గణపతి….పంపిణీకి శ్రీకారం

221
krishnudu
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ వినాయక చవితి సందర్భంగా విత్తన గణపతి పంపిణీకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో
మాదాపూర్ కాకతీయహిల్స్ లో సినీ నటుడు కృష్ణుడు కి తన నివాసంలో విత్తన గణపతి ని పంపిణీ చేశారు గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు.

వినాయక చవితి సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ విత్తన గణపతి కార్యక్రమం చేపట్టడం అభినందనీయం..ఈ వినాయక చవితి కి విత్తన గణపతిని పూజించడం ద్వారా మనకు చాలా మంచి జరుగుతుందన్నారు కృష్ణుడు.

వినాయకుని నిమజ్జనం అనంతరం అందులో నుండి వచ్చిన మొక్క పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో అవసరం..ప్రతీ ఇంటి ఆవరణలో ఒక వేప చెట్టు ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం కూడా దీని ద్వారా సిద్దిస్తుంది..
ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలన్నారు.

- Advertisement -