మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు 20మంది పోలీసులతో భద్రత

41
srinivas
- Advertisement -

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ హత్యకుట్రను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇంటెలిజన్స్ విభాగం సూచన మేరకు మంత్రికి భద్రత పెంచాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌ రాగానే అదనపు భద్రతా సిబ్బంది విధుల్లో చేరనున్నారు.

ఇందులో భాగంగా రెండు పైలట్‌ వాహనాలు, 20 మందితో భద్రత కల్పించనున్నారు. గతంలో ఒక పైలట్‌ వాహనం సహా పది మంది సెక్యూరిటీ ఉండేవారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు రూ.15 కోట్ల డీల్‌ జరిగినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేయడంతోపాటు రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో రాఘవేంద్రరాజు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

- Advertisement -