దాసరి అరుణ్‌పై అట్రాసిటీ కేసు..

109
dasari
- Advertisement -

దాసరి అరుణ్ కుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదయ్యింది. బొల్లారంలోని మారుతీనగర్కు చెందిన బ్యాగరి నర్సింహులు ఫిర్యాదు మేరకు ఆయనపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు పోలీసులు.

దాసరి నారాయణరావు వద్ద 2012 నుంచి 2016 దాకా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సినిమాల రిస్టోరేషన్ పనులు చేశారు నర్సింహులు. దాసరి మృతి తర్వాత కూడా పెండింగ్లో ఉన్న పనులను జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి వెళ్లి పూర్తి చేశాడు. అయితే ఇందుకు రావాల్సిన డబ్బుల విషయంలో దాసరి కొడుకులు అరుణకుమార్, ప్రభులతో వివాదం నడుస్తున్నది.

ఈ నేపథ్యంలో ఈ నెల 13న ఫిలింనగర్ లోని ఎఫ్ఎన్ఎసీసీ వద్దకు రావాలని దాసరి అరుణ్ కుమార్ చెప్పడంతో నర్సింహులు తన స్నేహితులు శ్రీనివాస్, చంటితో కలిసి వెళ్లగా అక్కడ వీరితో గొడవకు దిగారు అరుణ్ కుమార్. కులం పేరుతో దూషించగా నర్సింహులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన వారు దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -