రెజ్లర్ సుశీల్ కుమార్ కు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సుశీల్ బెయిల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల్లో పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. హత్య కేసులో గతంలో సుశీల్ కుమార్ కు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు.
జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రకాశ్ కుమార్ మిశ్రా లతో కూడిన ధర్మాసనం, మార్చి 4న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన కుమార్కు బెయిల్ మంజూరు చేసిన ఉత్తర్వును రద్దు చేసింది. సుశీల్ కుమార్ ఒక వారం లోపు లొంగిపోవాలని ఆదేశించారు.
మృతుడి తండ్రి అశోక్ ధంకడ్ తరఫున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ్ మృదుల్, కుమార్ తరఫున సీనియర్ అడ్వకేట్ మహేష్ జేత్మలానీ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. 2021 మే 4న ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం పార్కింగ్ ప్రాంగణంలో, ఆస్తి వివాదం కారణంగా, కుమార్ మరియు మరికొందరు కలిసి ధంకర్, అతని స్నేహితులు సోను, అమిత్ కుమార్లపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
హర్యానా రోహ్తక్కు చెందిన 23 ఏళ్ల రెజ్లర్ ధంకర్, దాడిలో తలెగిన గాయాల వల్ల మరణించాడు. మిగతా ఇద్దరు గాయపడ్డారు. పోస్ట్మార్టం నివేదిక ప్రకారం, బ్లంట్ ఫోర్స్ ట్రామా వల్ల ఏర్పడిన మెదడు నష్టం (సెరెబ్రల్ డ్యామేజ్) కారణంగానే ధంకర్ మృతి చెందాడు. సుశీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్య పతకం, 2012 లండన్ ఒలింపిక్స్లో రజత పతకం గెలుచుకున్నాడు.
Also Read:KTR:కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవండి

