చివరి షెడ్యూల్లో నాగచైతన్య “సవ్యసాచి”

320
- Advertisement -

నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “సవ్యసాచి”. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో ఆర్.మాధవన్, భూమిక కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం టాకీ పార్ట్ ఆగస్ట్ 8తో పూర్తి కానుంది. ఆగస్ట్ 15న ఫారిన్‌లో ఆఖరి పాటను చిత్రీకరించనున్నారు. సెప్టెంబర్ 15 నాటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తోపాటు సీజీ వర్క్ కూడా పూర్తి కానుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం.

Savyasachi Movie

తారాగణం: నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్.మాధవన్, భూమిక, రావురమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు.. సాంకేతిక నిపుణులు: సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: యువరాజ్, కళ: రామకృష్ణ, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, సహాయ దర్శకుడు: చలసాని రామారావు, సి.ఈ.ఓ: చిరంజీవి (చెర్రీ), లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్, సహ నిర్మాత: ప్రవీణ్.ఎం, నిర్మాతలు: నవీన్ యెర్నేని-వై.రవిశంకర్-మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), కథ-మాటలు-చిత్రానువాదం-దర్శకత్వం: చందు మొండేటి.

- Advertisement -