త‌మిళ్, మ‌ల‌యాళంలోకి రామ్ చ‌ర‌ణ్ మూవీ..

284
rangasthalam
- Advertisement -

రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లోనే బెగ్గెస్ట్ హిట్ గా నిలిచింది రంగ‌స్ధ‌లం మూవీ. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈమూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా మైత్రి మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మించారు. రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న హీరోయిన్ గా స‌మంత న‌టించ‌గా…అత్త‌గా అన‌సూయ న‌టించింది. ఈచిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ప‌ల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈసినిమా బాక్సాఫిస్ వ‌ద్ద అత్య‌ధికంగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. ఈచిత్రం ఇటివ‌లే 100డేస్ ఫంక్ష‌న్ కూడా పూర్తి చేసుకుంది.

Rangasthalam

ఈసినిమా సుమారు రూ.200కోట్ల వ‌ర‌కూ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. తెలుగులో ఇంత పెద్ద విజయం సాధించిన ఈమూవీని త‌మిళ్ , మ‌ల‌యాళంలో అనువాదం చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. త‌మిళంలోని ప్ర‌ముక నిర్మాత స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞాన‌వేల్ రాజా ఈచిత్రాన్ని త‌మిళంలో విడుద‌ల చేయ‌నున్నార‌ని తెలుస్తుంది. త‌మిళ్ లో శాటిలైట్ హక్కుల‌ను కూడా తీసుకున్నార‌ని స‌మాచారం. రంగ‌స్ధ‌లం సినిమా త‌మిళ్ , మ‌ల‌యాళంలోకి అనువాదించ‌డంతో మ‌రిన్ని వ‌సూళ్లు పెరిగే అవ‌కాశం ఉంది.

- Advertisement -