నింగిలోకి బుల్లి ఉపగ్రహం..

212
- Advertisement -

అంతరిక్ష్యంలో భారత్ మరో ప్రయోగానికి సిద్దమవుతోంది. ప్రపంచంలోనే అతి చిన్న ఉపగ్రహం ‘జైహింద్‌`1ఎస్‌’ ను స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ విద్యార్థులు రూపొందించారు. ఈ బుల్లి శాటిలైట్‌ బరువు కేవలం 33.39 గ్రాములు. నేడు దీన్ని నింగిలోకి పంపనుంది నాసా. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కొలంబియా సైంటిఫిక్‌ బెలూన్‌ ఫెసిలిటీ నుంచి బెలూన్‌ సాయంతో దీన్ని శుక్రవారం కక్ష్యలోకి చేరుస్తోంది.

Satellite Jaihind-1S to be launched today

తమిళనాడు రాజధాని చెన్నై శివార్లలోని హిందుస్థాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు కె.జె.హరికృష్ణన్‌, పి.అమర్‌నాథ్‌, జి.సుధీ, టి.గిరిప్రసాద్‌లు ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశారు. ‘అంతరిక్షంలో సంచరిస్తున్న భిన్న పదార్థాలు, గురుత్వాకర్షణ శక్తి తక్కువ ఉన్నప్పుడు వాటి ప్రవర్తన అర్థం చేసుకునేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది’ అని శాటిలైట్‌ రూపొందించిన విద్యార్థుల గైడ్‌ జి.దినేష్‌ కుమార్‌ తెలిపారు.

- Advertisement -