సర్పంచ్‌లు గ్రామాభివృద్ధికి పాటుపడాలి: ఎమ్మెల్సీ కవిత

155
mlc kavitha
- Advertisement -

మంగళవారం నిజామాబాద్‌ జిల్లా సర్పంచ్‌ల ఫోరం ప్రతినిధులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అసోల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి యెడ్ల రాజేశ్వర్ రెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

గత ఆరేండ్లుగా గ్రామాల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ సర్పంచ్‌లకు అండగా నిలుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా సర్పంచ్‌లు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్‌లు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారంతో పాటు గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సర్పంచ్‌లు పలు వినతులను ప్రస్తావించగ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు.

- Advertisement -