- Advertisement -
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”సర్కారు వారి పాట”. భారీ అంచనాల మధ్య గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. మొదటి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయినప్పటికీ టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతోంది. తాజా సమాచారం ప్రకారం సర్కారు వారి పాట ఈ రోజుకు 100 కోట్ల షేర్ మార్కును అందుకుంది.
ఇంతవరకూ ఈ సినిమా 160 కోట్లకి పైగా గ్రాస్ ను .. 100 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది. చాలా వేగంగా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడాన్ని విశేషంగా చెబుతున్నారు. ఈ వసూళ్లను అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ను వదిలారు. మహేష్ సరసన కీర్తి సురేష్ కథానాయికాగా నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. పాటలు.. ఫైట్లు.. మహేష్ మార్కు కామెడీ.. సముద్రఖని విలనిజం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి.
- Advertisement -