జనవరి 5న సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్..

540
mahesh babu
- Advertisement -

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. మహేష్ సరసన రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమాకు సంబంధించి విజయశాంతి ఫేస్‌ బుక్‌లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది.

మనం భారతీయులం

సరిలేరు మనకెవ్వరు

సంప్రదాయంగా.. సంస్కృతి ధర్మపరంగా..

ఇది మన దేశం నేర్పిన విధానం

ఆ ఉన్నత విలువలతో కూడిన ఒక చక్కని సందేశాత్మక చిత్రంగా మీ ముందుకు వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం టైటిల్ నెంబర్ నేటి సాయంత్రం 5.04 గంటలకు విడుదల కానుంది. జనవరి 5, 2020వ తేదీన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలిపారు.

- Advertisement -