చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌…మృతదేహాలకు రీపోస్టుమార్టం

427
chatanpalli
- Advertisement -

చటాన్ పల్లి ఎన్ కౌంటర్ లో చనిపోయిన నాలుగు మృతదేహాలకు రీ పొస్ట్ మార్టం జరుగుతోంది. ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం రీ పోస్టుమార్టం చేయనుండగా పోస్టుమార్టంలో పాల్గొననున్నారు గాంధీ సూపర్ డెంట్.

రీ పోస్టు మార్టం మొత్తాన్ని పోలీసులు వీడియో చిత్రీకరించగా నిందితుల కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. రీ పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత రిపోర్ట్ షీల్డ్ కవర్‌లో అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను గాంధీ వైద్యుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు.

దిశ హత్యాచార కేసు నిందితులను షాద్‌నగర్ చటాన్ పల్లి బ్రిడ్జి వద్ద ఈ నెల 6వ తేదీన పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం విదితమే.

- Advertisement -