సరిలేరు నీకెవ్వరు.. ట్రైలర్ దద్దరిల్లి పోయింది..

271
mahesh
- Advertisement -

టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా, రష్మికా మందన్న హీరోయిన్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా ట్రైలర్ గత రాత్రి విడుదలై ట్రెండ్ సెట్ చేస్తోంది. నిన్న రాత్రి 9 గంటలకు విడుదలైన ట్రైలర్‌కు యూ ట్యూబ్ లో ఇప్పటికే 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 2 నిమిషాల 24 సెకన్లు ఉన్న ట్రైలర్‌లో మొదటి నిమిషం పాటు ట్రైన్ ఎపిసోడ్ కామెడీని చూపించారు.

బండ్ల గణేష్‌తో పాటు రాజేంద్ర ప్రసాద్.. రష్మిక.. సంగీత ఇంకా పలువురి కామెడీ రచ్చ రచ్చ ఉండబోతుందని ట్రైలర్ తోనే చెప్పారు. ట్రైలర్ లోనే మహేష్‌ బాబు కామెడీ టైమింగ్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ చివరిలో మహేష్‌ చెప్పిన “చిన్న బ్రేక్ ఇస్తున్నాను… తరువాత బొమ్మ దద్దరిల్లిపోద్ది” డైలాగ్, హైలైట్ గా నిలిచింది.దిల్‌ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ నెల 11న ప్రేక్షకులముందుకురానుంది.

- Advertisement -