న్యాయం గెలిచింది: మాజీ ఎంపీ సంతోష్ కుమార్

4
- Advertisement -

న్యాయం గెలిచింది సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని ఎక్స్ వేదికగా తెలిపారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. తన సోదరి,ఎమ్మెల్సీ కవితకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు లో స్వాగతం పలికారు. బెయిల్ మంజూరై తిరిగి ఇంటికి చేరుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు సంతోష్ కుమార్.

మీరు తిరిగి వచ్చినందుకు ఆనందంగా ఉంది ఎంతో ఉపశమనం పొందాం అన్నారు. ఈ కష్ట సమయాల్లో దృఢంగా ఉన్న మిమ్మల్ని చూసి ఎంతో ధైర్యం కలిగింది..శాంతి,సంతోషంతో నిండిన ఈ క్షణం కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని తెలిపారు.

 

Also Read:శంషాబాద్‌లో ఎమ్మెల్సీ కవితకు ఘనస్వాగతం..

- Advertisement -