మొక్కలను నాటాలని ప్రతిజ్ఞ చేద్దాం:సంతోష్ కుమార్

13
- Advertisement -

చెట్లను నాటాలని ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. చెట్లను నాటడం, వాటిని సంరక్షించడంపై 1972లోనే దూరదర్శన్ ప్రసారం చేసిన యానిమేటెడ్ క్లిప్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు సంతోష్ కుమార్.

ఈ కార్టూన్ యొక్క సందేశం నేడు, 2025లో మరింత తీవ్రంగా ప్రభావితం చేస్తుంది శక్తివంతమైన సత్యాన్ని తెలియజేస్తుంది, ఈ సందర్భంగా చెట్లను నాటాలని ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు.

మనం చెట్లను నరికి ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, మన భవిష్యత్ తరాలు దానికి మూల్యం చెల్లించుకుంటాయి.వాతావర ణ మార్పు, గ్లోబల్ వార్మింగ్, క్షీణిస్తున్న పచ్చదనం యొక్క భయంకరమైన వాస్తవికత మన కళ్ళ ముందే ఉంది అన్నారు. మరిన్ని చెట్లను నాటాలని ప్రతిజ్ఞ చేద్దాం…మన పిల్లలకు పచ్చని ప్రదేశాల విలువను నేర్పిద్దాం…మన భవిష్యత్తు ఒకప్పుడు ప్రకృతి ఎలా ఉండేదో దాని జ్ఞాపకంగా ఉండకుండా ఇప్పుడే చర్యలు తీసుకుందాం అన్నారు.

Also Read:నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత

- Advertisement -