సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఝలక్!

89
jaggareddy
- Advertisement -

కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సొంతనియోజకవర్గంలోనే షాక్ తగిలింది. సంగారెడ్డిలో రేవంత్, జగ్గారెడ్డి ఇలా రెండుగా చీలిపోయిన కాంగ్రెస్ నేతలు పోటాపోటీ ధర్నకు దిగారు.

డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పెంచిన ధరలకు నిరసనగా తలపై కట్టెలు పెట్టుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీతో ధర్నా నిర్వహించారు. మరోవైపు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొన్నం శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో మరోవర్గం నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో స్ధానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డికి షాక్ తగిలింది. ఒకే పార్టీకి చెందిన నేతలు ఇలా పోటాపోటీగా ధర్నాలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -