బీజేపీలోకి ఆలేరు మాజీ ఎమ్మెల్యే!

138
goud
- Advertisement -

ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ త్వరలోనే బీజేపీలో చేరనున్నారు. ఈ నెల 4 లేదా 5వ తేదీల్లో ఢిల్లీలో భిక్షమయ్యగౌడ్‌ బీజేపీ కండువా కప్పుకొనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయ జీవితం ప్రారంభించిన భిక్షమయ్య గౌడ్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆలేరు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

తర్వాత 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత చేతిలో పరాజయం పాలయ్యారు. 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. అయితే అప్పటినుండి పెద్దగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంది లేదు.

తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నామినేటెడ్‌ పోస్టులు ఆశించిన భిక్షమయ్యకు నిరాశే ఎదురుకావడంతో పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -