సమంతను చూస్తే కన్నీళ్లొచ్చాయి – శోభితా

105
- Advertisement -

నాగచైతన్య – శోభితా ధూళిపాళ్ల ప్రేమ వ్యవహారం గత వారం కూడా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. లండన్‌లోని ఓ హోటల్ చెఫ్ నాగ చైతన్యతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే, విచిత్రంగా ఈ ఫోటో బ్యాక్‌ గ్రౌండ్‌ లో శోభిత ధూళిపాళ్ల కనిపించింది. దీంతో వీరిద్దరి డేటింగ్ నిజమేనని రుజువు అయిపోయింది. ఐతే, తాజాగా శోభితా ధూళిపాళ్ల, సమంతను అలా చూసి కన్నీళ్లు వచ్చేశాయి అంటూ శోభితా కామెంట్స్ చేసింది. ఇంతకీ శోభితా ధూళిపాళ్ల సమంత గురించి ఏం మాట్లాడిందో అంటూ నెటిజన్లు నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు.

ఐతే, శోభితా ధూళిపాళ్ల మాట్లాడింది హీరోయిన్ సమంత గురించి కాదు, తన సోదరి సమంత గురించి. శోభితా ధూళిపాళ్ల విశాఖపట్నంలో జరిగిన తన సోదరి సమంత వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. మెహందీ, సంగీత్‌ ఫొటోలను షేర్‌ చేసిన శోభితా ధూళిపాళ్ల.. తన సోదరిని పెళ్లి కుమార్తెగా చూసి తాను భావోద్వేగానికి గురైనట్లు రాసుకొచ్చారు. ‘‘మా బంధువులందరూ ఈ వేడుకల్లో కలుసుకున్నాం. ఈ వేడుకల్లో అందంగా ముస్తాబు కావాలనుకున్నాను. కాకపోతే పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉండటం వల్ల మెహందీకి సరిగ్గా రెడీ కాలేకపోయాను. సమంతను పెళ్లి కుమార్తెగా చూస్తుంటే ఎమోషనల్ అయ్యాను. ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి’’ అని శోభితా ధూళిపాళ్ల పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి…

‘దసరా’ 4 డేస్ డిటైల్డ్ కలెక్షన్స్

పాటకు 5 కోట్లు, రైట్స్ కి 36 కోట్లు!

Balagam: మరో అంతర్జాతీయ అవార్డు

- Advertisement -