జీవా, సాక్షి డ్యాన్స్ చూశారా..? వీడియో

215
- Advertisement -

ఇంగ్లండ్ పర్యటన ముగించుకుని టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ఇండియా తిరిగి వచ్చాడు. ప్రస్తుతం విరామ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ధోని భార్య సాక్షికి ఫ్రెండ్ అయిన కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ కుమార్తె వివాహం శుక్రవారం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సాక్షి కుటుంబ సమేతంగా హాజరైంది. ఈ వేడుకలో ధోనీ గారాల పట్టి జీవా ఆకర్షణగా నిలిచింది.

dhoni family

ఈ మెహందీ ఫంక్షన్ లో తన గారాల పట్టి చేసిన డ్యాన్ వీడియోని ధోని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సాక్షి డ్యాన్స్ చేస్తూ.. స్టెపులు చూపిస్తుండగా.. జీవా ఆ స్టెపులను వేసే ప్రయత్నం చేస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీవా డ్యాన్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గతంలోనూ జీవా డ్యాన్స్ చేస్తున్న వీడియోలను మనం చూశాం. ఇక ఈ వేడుకకు యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర, జహీర్ ఖాన్, పార్దివ్ పటేల్ కూడా హాజరయ్యారు. ధోని టెస్టులకు గుడ్ బై చెప్పడంతో ఇంగ్లండ్ తో టీ20, వన్డేల సిరీస్ లను ముగించుకుని ఇండియా వచ్చేసి ఇలా జీవాతో ఎంజాయ్ చేస్తున్నాడు.

- Advertisement -