మొక్కలు నాటిన సినీనటి సాకేత్ మాధవి..

518
saketh madhavi
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు సినీ నటి సాకేత్ మాధవి.అనంతరం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని సినీ నటి సాకేత్ మాధవి అన్నారు.

చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకడిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. నటుడు జ్వాల చక్రవర్తి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ తన నివాసంలో లో మూడు మొక్కలు నాటింది.అనంతరం మరో ముగ్గురు ( నటులు ముఖేష్ , పొట్టి విజయ్ , తెనాలి పంతులు )లు కూడా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని సినీ నటి సాకేత్ మాధవి పిలుపునిచ్చారు….

- Advertisement -