చంద్రబాబు ఓటమిని అంగీకరించాలి: సజ్జల

150
sajjala
- Advertisement -

ఏపీలో జరిగిన స్ధానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ స్ధానాలను కైవసం చేసుకోగా టీడీపీ-వైసీపీ ఒకరిపైఒకరు విమర్శలు గుప్పించుకునే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే స్పందించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఓటమిని చంద్రబాబు అంగీకరించాలని సూచించారు.

ఓటమిని కూడా కొందురు వేడుక చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా ఓటమిని అంగీకరిస్తే బాగుంటుందని…. పార్టీ మద్దతుతో విజయం సాధించిన అభ్యర్థుల ఫొటోలను సాయంత్రానికి వెబ్‌సైట్‌లో ఉంచుతాం అన్నారు. అమరావతి ప్రాంతంలోనూ వైసీపీకి మంచి ఫలితాలు వచ్చాయని వెల్లడించారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కారణమయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో 81 శాతానికిపైగా తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారని తెలిపారు.

- Advertisement -