ప్రభుత్వ మోడల్ స్కూల్‌ని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి…

238
dayakarrao
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరు ప్రభుత్వ మోడల్‌ హైస్కూల్‌ని సందర్శించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో సీటింగ్ అరెంజ్‌మెంట్స్‌ ఇతర వసతులు ఎలా ఉన్నాయంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న తొమ్మిది, పదో తరగతి విద్యా బోధన జరుగుతున్న తీరుని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ సునీతని అడిగి తెలుసుకున్నారు. స్కూల్లో ఇంకా ఏయే అవసరాలు ఉన్నాయంటూ మంత్రి ఆరా తీశారు. వంట కోసం ఒక షెడ్ కావాలని అడగడంతో వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి షెడ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

- Advertisement -