- Advertisement -
ప్రేమమ్ సినిమాతో తెలుగు, తమిళ, మాలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. తెలుగులో ప్రేమమ్, ఫిదా సినిమాతో స్టార్ హిరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది ఈ మల్లు బ్యూటీ. తాజాగా ఫిదాతో తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన శేఖర్ కమ్ములతో సినిమా చేస్తోంది సాయిపల్లవి.
నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ మూవీ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఇక నటనతో పాటు డ్యాన్స్లోను సత్తాచాటుతున్న సాయిపల్లవి ఈ సినిమా కోసం కొరియోగ్రాఫర్గా పనిచేయనుందట.
స్వయంగా ఈ ప్రపోజల్ని సాయి పల్లవి ముందు ఉంచారట శేఖర్ కమ్ముల, నాగచైతన్య. దీనికి సాయి పల్లవి కూడా ఓకే చెప్పగా రామోజీ ఫిలిం సిటీలో ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త టీటౌన్లో హాట్ టాపిక్గా మారింది.
- Advertisement -