సంతానంతో సై అంటున్న సాయిపల్లవి..

226
- Advertisement -

‘ఫిదా’ సినిమాతో తెరంగేట్రం చేసిన సాయిపల్లవి తెలుగువారందర్నీ ఫిదా చేసేసింది. అద్భుతమైన నటన, డబ్బింగ్‌తో తెలుగువారిని మెస్మరైజ్‌ చేసింది. ‘ప్రేమమ్‌’ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకుంది సాయి పల్లవి. ఆ సినిమాలో లెక్చరర్‌ మలార్‌గా నటించి అందర్నీ మెప్పించింది.

ఇప్పుడీ భామను ఓ తమిళ్ సినిమా చేయాలంటూ మేకర్స్ అప్రోచ్ అయ్యారు. స్టార్ కమెడియన్ స్టేటస్ ఉన్న సంతానం.. ఇప్పుడు హీరోగా మారిన సంగతి తెలిసిందే. సంతానం హీరోగా రూపొందనున్న మరుసటి చిత్రం కోసం సాయి పల్లవిని అడిగినట్లు దర్శకుడు రాజేష్ తెలిపాడు. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ చిత్రానికి.. ప్రస్తుతం క్యాస్టింగ్.. టెక్నికల్ టీంను ఫైనల్ చేస్తున్నట్లు.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రాజేష్. సాయి పల్లవికి కథపై పూర్తి నేరేషన్ ఇచ్చామని.. ఆమె ఆసక్తి చూపినా.. ఇంకా ప్రాజెక్టుకు సైన్ చేయలేదని చెప్పాడు. ప్రస్తుతం ఆమె చేస్తున్న మూవీతో బిజీగా ఉండడం కారణంగానే.. డేట్స్ ఇంకా అడ్జస్ట్ కాలేదన్నది మేకర్స్ వెర్షన్.

Sai Pallavi to romance with Santhanam

ప్రస్తుతం తమిళ్ లో ఓ మూవీ చేస్తోంది సాయి పల్లవి – ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న కరు చిత్రంలో నటిస్తోంది. స్టార్ హీరో విజయ్ నటిస్తున్న మెర్సల్ చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీ తేనాండాల్ ఫిలిమ్స్ బ్యానర్ పైనే ఈ చిత్రం రూపొందనుండగా.. త్వరలో సంతానం మూవీపై సాయి పల్లవి నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ చివరలో షూటింగ్ ప్రారంభించేదుకు సన్నాహాలు చేసుకున్నట్లు దర్శక నిర్మాతలు చెప్పారు.

- Advertisement -