- Advertisement -
కల్కి 2 లో దీపికా పదుకొనే ఇక లేరనే విషయం తెలిసిందే. దీనితో దర్శకుడు నాగ్ అశ్విన్ కొత్త ప్రాజెక్టుపై దృష్టి సారించినట్లు సమాచారం.సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఈ ప్రతిభావంతుడైన దర్శకుడు, సాయి పల్లవితో మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
తన శక్తివంతమైన నటన, గట్టి స్క్రీన్ ప్రెజెన్స్తో గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ప్రధాన పాత్రధారిగా ఉండబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
అధికారిక ప్రకటన రావలసి ఉన్నప్పటికీ, ఈ సినిమా భావోద్వేగం, డ్రామా, సామాజిక సంబంధిత అంశాలను మేళవించిన ప్రత్యేక కాన్సెప్ట్పై నిర్మించబడనుందని సమాచారం.
Also Read:విజయ్ రాజకీయ నాయకుడు కాదు..నటుడే!
- Advertisement -

