సాయిపల్లవి రైలు ఎక్కుతూ పడింది

353
Fidaa actor Sai Pallavi
- Advertisement -

ఫిదా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులని ఫిదా చేసిన సినిమా. ఈ సినిమాతో హీరో కి కూడా రాణి క్రేజ్ హీరోయిన్ సాయి పల్లవి కి వచ్చేసింది. భానుమతి క్యారెక్టర్ తో జనాల మనసుల్లో స్థానం పొందిన ఈ అమ్మడుకి ఇప్పుడు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ జనాల్లో అత్యంత క్రేజీ పర్సన్ సాయి పల్లవి.అంతేకాకుండా ఆమె చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. భానుమతి పాత్ర తెర మీద గొప్పగా కనిపించడానికి సాయి పల్లవి పడిన కష్టాన్ని దర్శకుడు శేఖర్ కమ్మలు ఇటీవల వివరించారు.

 saipallavi

ఆమెను ఆడిషన్ లో చూడగానే తానే నా భానుమతి అని ఫిక్స్ అయ్యాను అని చెప్పాడు. ఫిదా చిత్రంలో సాయిపల్లవి చాలా కష్టపడిందని, కదిలే రైలు ఎక్కడం, దిగడం, పొలాల్లో ట్రాక్టర్‌ నడపడం లాటి కష్టమైన పనులను నేర్చుకొన్నందని చెప్పారు శేఖర్‌ కమ్ముల. సాయిపల్లవి ఇంటర్వెల్‌ సీన్‌లో ట్రైన్‌ నుంచి దూకుతూ నిజంగానే కింద పడిపోయిందని, అప్పుడు ఆమెకు బలమైన గాయాలు కూడా అయ్యాయని పేర్కొన్నారు శేఖర్‌ కమ్ముల.

సినిమాలో.. వరుణ్ తో మాట్లాడి కోపంలో భానుమతి ట్రైన్ దిగేసి ఏడుస్తూ కూర్చుంటుంది. అయితే ట్రైన్ వెళ్లిపోతుంటే మల్లి పరిగెత్తుకుంటూ రన్నింగ్ ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. ఆ సీన్ చేసే ప్రయత్నంలో ఆమె కింద పడిపోయి మోకాళ్ళకు బాగా దెబ్బలు తగిలాయని కళ్లు తిరిగే నిజాన్ని వెల్లడించారు. అందుకే ఆ సీన్ సినిమాలో పెట్టలేకపోయామని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.

- Advertisement -