కిషోర్ తిరుమ‌ల‌తో సుప్రీం హీరో..

252
Sai Dharam Tej
- Advertisement -

సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ ప్రస్తుతం తేజ్ క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ‘తేజ్ ల‌వ్ యూ’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తోంది అనుప‌మా  ప‌ర‌మేశ్వ‌రన్. డిఫ‌రెంట్ ప్రేమ క‌థ‌తో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుద‌ల చేసిన ఈ చిత్ర టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

 Sai Dharam Tejఇందులో సాయిధ‌ర‌మ్ తేజ్, అనుప‌మ‌ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఈ సినిమా జూన్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రం విడుదల కాక‌ముందే మారో సినిమా చేసేందుకు సిద్ద‌మ‌య్యాడు సాయి ధ‌రమ్. కిషోర్ తిరుమ‌ల‌తో ఓ సినిమా చెయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

రామ్‌తో ‘నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ’ వంటి చిత్రాలు చేసిన కిషోర్ మొద‌ట‌గా ఓ క‌థను నానీకి వినిపించాడ‌ట‌. అది ఆయ‌న‌కు నచ్చ‌క‌పోవ‌టంతో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు వినిపించాడు. దీనికి ఈ మెగా హీరో ఓకే చెప్పడంతో త్వ‌రలో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నున్న‌ట్లు తెలుస్తోంది. సాయిధ‌ర‌మ్ ఈ సినిమా కాకుండా గోపిచంద్ మలినేని ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.

- Advertisement -