ఎన్టీఆర్ సపోర్ట్ తో గట్టేక్కేశాడు

158
- Advertisement -

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ మీడియం బడ్జెట్ సినిమాకు భారీ బజ్ తీసుకురావడం అంటే చాలా కష్టమైన పని. అయితే టైటిల్ గ్లిమ్స్ తోనే కావలసినంత బజ్ తెచ్చేసుకున్నాడు సాయి తేజ్. కార్తీక్ దండు డైరెక్షన్ లో సుకుమార్ స్క్రీన్ ప్లే తో వస్తున్న సాయి ధరం తేజ్ ‘విరూపాక్ష’ సినిమాకు సంబంధించి టైటిల్ రివీల్ చేస్తూ కథ గురించి హింట్ ఇస్తూ ఓ గ్లిమ్స్ వదిలారు మేకర్స్.

ఈ గ్లిమ్స్ కి జూనియర్ ఎన్టీయార్ వాయిస్ ఓవర్ అందించాడు. “అజ్ఞానం భయానికి మూలం , భయం మూడ నమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం” అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ టైటిల్ గ్లిమ్స్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనిపించుకుంది. మెగా ఫ్యామిలీ లో చాలా మంది స్టార్ హీరోలున్నారు. టాప్ లీగ్ లో చిరు , పవన్ కళ్యాణ్, బన్నీ , రామ్ చరణ్ ఉన్నారు. కానీ వారి సపోర్ట్ తో కాకుండా ఈసారి ఎన్టీఆర్ సపోర్ట్ అందుకొని టైటిల్ గ్లిమ్స్ తో తన సినిమాపై హైప్ తెచ్చుకున్నాడు తేజ్. ప్రెజెంట్ ఎన్టీయార్ వాయిస్ ఓవర్ తో టైటిల్ గ్లిమ్స్ భారీ వ్యూస్ కొల్లగొడుతూ దూసుకెళ్తోంది.

నిజానికి స్టార్ హీరోల వాయిస్ ఓవర్ సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ నిర్మాతలు , భోగవల్లి ప్రసాద్ , సుకుమార్ కోసం టైటిల్ గ్లిమ్స్ కి తన వాయిస్ అందించి సినిమాపై అంచనాలు పెంచేశాడు. ఏదేమైనా తారక్ తో వాయిస్ చెప్పించాలనే ఆలోచన ఎవరిదో కానీ విరూపాక్ష కి భలే కలిసొచ్చింది. తారక్ వాయిస్ లేకుండా ఈ గ్లిమ్స్ వచ్చి ఉంటే ఇంత టాక్ వచ్చేది కాదు. సో ఎన్టీఆర్ సపోర్ట్ తో మెగా హీరో గట్టేక్కేశాడనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి…

ఒక్క హిట్ కే కోటి పెంచిన దర్శకుడు

జనవరి 13న వాల్తేరు వీరయ్య…

వినూత్న చిత్రానికి సెన్సార్ నుంచి ప్రశంసలు

- Advertisement -