భగత్‌కు అండగా సాగర్ ప్రజలు: తలసాని

153
talasani
- Advertisement -

నోముల భగత్‌కు అండగా సాగర్ ప్రజలు ఉన్నారని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి హాలియాలో మంత్రి మీడియాతో మాట్లాడారు. సాగర్ అభివృద్ధికి టీఆర్ఎస్ కట్టుబడి ఉందని…సాగర్ పై భగత్‌కు పూర్తి అవగాహన ఉందని…తన తండ్రికి చేదోడు వాదోడుగా పనిచేశారన్నారు.

జానారెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినప్పటికీ సాగర్‌కు చేసిందేమీ లేదని విమర్శించారు. కనీసం సొంత గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోలేదన్నారు.పల్లెప్రగతితో గ్రామాలు అందంగా మారాయని వెల్లడించారు. రైతుబీమా, రైతుబంధు పథకాలతో నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమచేస్తున్నామని చెప్పారు. కల్యాణలక్ష్మి ద్వారా ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.లక్షా 116 ఇస్తున్నామని తెలిపారు.

కరోనా కష్టకాలంలో కూడా ఒక సంక్షేమ పథకాన్ని ఆపలేదని చెప్పారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి మద్దుతివ్వాలని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భగత్‌ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీరివ్వాలని సీఎం కేసీఆర్‌ కొత్త లిఫ్టులను మంజూరు చేశారని తెలిపారు.

- Advertisement -