తిరుపతిలో దక్షిణాది సీఎంల సమావేశం..

96
kcr
- Advertisement -

తిరుపతిలో ఈ నెల 14న దక్షిణాది సీఎంల సమావేశం జరగనుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానుండగా ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయంతో పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానుండగా ప్రత్యేక ఆహ్వానితులుగా పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్లు హాజరవుతారు.

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు, సమస్యలు, కౌన్సిల్ లోని రాష్ట్రాల సరిహద్దు సమస్యలు, భద్రత, మౌళిక వసతుల కల్పన, పర్యావరణం, ఆహార భద్రత, గృహనిర్మాణం, విద్య వంటి అంశాలపై భేటీలో చర్చించనున్నారు.

- Advertisement -