జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా ప్రస్తుతం పనిచేస్తున్న సదానంద్ వసంత్ దాతే మహారాష్ట్ర తదుపరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా నియమితులు కానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను తక్షణమే ఎన్ఐఏ నుంచి విడుదల చేసి, ఆయన పేరెంట్ క్యాడర్ అయిన మహారాష్ట్రకు రిపాట్రియేట్ చేసింది.
ఈ నిర్ణయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతిపాదనపై కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ (ACC) ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (DoPT) సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతిపాదన మేరకు, సదానంద్ వసంత్ దాతే, ఐపీఎస్ (మహారాష్ట్ర: 1990 బ్యాచ్), డీజీ, ఎన్ఐఏను తక్షణ ప్రభావంతో ఆయన పేరెంట్ క్యాడర్కు ముందస్తుగా రిపాట్రియేట్ చేయడాన్ని కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదించింది అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
సదానంద్ వసంత్ దాతే 1990 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన మహారాష్ట్ర క్యాడర్కు చెందినవారు. 2008 నవంబర్లో జరిగిన 26/11 ముంబయి ఉగ్రదాడుల సమయంలో కామా ఆసుపత్రి వద్ద ఉగ్రవాదులు అజ్మల్ కసాబ్, అబూ ఇస్మాయిల్ను ఎదుర్కొని, ఆసుపత్రి సిబ్బంది మరియు రోగుల ప్రాణాలను కాపాడినందుకు ఆయన విస్తృతంగా గుర్తింపు పొందారు.
Also Read:మాస్ అవతారంలో విజయ్..’రౌడీ జనార్ధన’
ఎన్ఐఏలో చేరకముందు, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్గా పనిచేసిన దాతే, ఉగ్రవాద నిరోధక చర్యల్లో కీలక పాత్ర పోషించారు. 2008 ముంబయి ఉగ్రదాడుల సమయంలో చూపిన అపార ధైర్యానికి గుర్తింపుగా, సదానంద్ దాతేకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ (PPMG) ప్రదానం చేశారు.

