క్రికెట్‌ ప్రపంచమా…నామ్‌ యాద్‌ రఖ్నా:సచిన్‌ ట్వీట్‌

285
- Advertisement -

2022 పోట్టి ప్రపంచ కప్‌ ఆరంభంలో శ్రీలంకకు గట్టి షాక్‌ తగిలింది. గ్రూప్‌ దశలో ఆడిన నమీబియా-శ్రీలంక జట్ల మధ్య అనుకొని సంఘటన చోటు ఎదురైంది. అతి చిన్న జట్టైన నమీబియా ఆసియా కప్‌ విజేతైన శ్రీలంకను మట్టి కరిపించింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో నమీబియా శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటుతో చెలరేగిన నమీబియా ఆపై కట్టుదిట్టమైన బౌలింగ్‌ ప్రదర్శనతో శ్రీలంకకు నిద్ర రాకుండా చేసింది.

ఈ సందర్భంగా అద్వితీయ విజయం సాధించిన నమీబియా జట్టుపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పేరు గుర్తుపెట్టుకోండి అంటూ నమీబియా ప్రపంచ క్రికెట్‌కు సందేశం పంపింది అంటూ భారత క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ తెందూల్కర్‌ ట్వీట్‌ చేశారు. కాగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఇప్పటికే సచిన్‌ ట్వీట్‌ను దాదాపు 55వేల మందికి పైగా లైక్‌ చేశారు. సచిన్‌తో పాటు పలువురు భారత మాజీలు సైతం ఆ జట్టును కొనియాడుతూ పోస్టులు చేశారు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన నమీబియా నిర్ణీత 20ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 163పరుగులు చేసింది. నమీబియా ఆల్‌రౌండర్లు కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడారు. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో కేవలం 108 పరుగులకే కుప్పకూలి 55 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో గ్రూప్‌ దశలో నమీబియా ఆగ్రస్థానంలో కొనసాగుతోంది.

- Advertisement -