Sabitha:అసెంబ్లీ నుండి దొంగలా పారిపోయిన రేవంత్

9
- Advertisement -

అసెంబ్లీ నుండి సీఎం రేవంత్ రెడ్డి దొంగలా పారిపోయారన్నారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. అసెంబ్లీ వాయిదా అనంతరం మాట్లాడిన సబితా…భట్టి మాటలు బాధకరం అన్నారు. భట్టి గారు మీ పక్క సీటు ఎందుకు, మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చామని కంటతడి పెట్టుకున్నారు. మేం తప్పు చేయలేదు, పార్టీ మారారని మీకు అనే హక్కు లేదు అన్నారు.

మేము పార్టీ మారలేదు… పార్టీ నుంచి బయటకు మెడ పట్టి గెంటేశారన్నారు. మా కుటుంబానికి ఓ చరిత్ర ఉంది, ఎన్టీఆర్ ను పక్కకు దించేసినప్పుడు ఇంద్రారెడ్డి…2014లో టికెట్ ఇవ్వకపోయినా నేను పార్టీకి పనిచేశాను అన్నారు. రాజకీయాల్లోకి రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చారు, మహిళలను మహానేత రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారు అన్నారు.కానీ ప్రస్తుతం సభలో మహిళలను కనీసం మాట్లాడనివ్వడం లేదు,ముఖ్యమంత్రి సీటు రేవంత్ రెడ్డి సొంతం కాదు.. నాలుగు కోట్ల ప్రజలు ఇచ్చిన పదవి అన్నారు.

ఏ పార్టీలో ఉన్నా… కమిట్ మెంట్ తో పనిచేశామన్నారు మాజీ మంత్రి సునీతా రెడ్డి. రాష్ట్ర మహిళలను అవమానించినట్లేనని…అధికారంలో ఉన్నా లేకున్నా జెండా మోసి కార్యకర్తలను కాపాడుకున్నాం అన్నారు. దొంగలే దొంగ అన్నట్లుగా ఉందని, డీకే అరుణ, సబితారెడ్డితో పాటు నన్ను అవమానించారన్నారు.

Also Read:KTR:ఓట్ల‌కు ముందు అభ‌య హ‌స్తం.. ఓట్లు ప‌డ్డాక శూన్య హ‌స్తం

- Advertisement -