27న బెల్లంకొండ శ్రీను సాక్ష్యం..

257
bellamkonda srinivas
- Advertisement -

బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాక్ష్యం”. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. చివరి షెడ్యూల్ లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, వెన్నెల కిషోర్ ల కాంబినేషన్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ
సినిమా జులై 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇటీవలె హైదరాబాద్‌లో విడుదల చేసిన ఆడియోకి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్‌ను ట్వీట్టర్‌లో తెలుపుతూ సినిమా స్టిల్స్‌ని షేర్ చేశాడు హీరో బెల్లంకొండ శ్రీను. రీవెంజ్ డ్రామా నేపథ్యంలో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ఒక తప్పు చేసి దానికి సాక్ష్యాల్లేకుండా చేసే ఉద్దేశంతో హీరో కుటుంబాన్ని విలన్లు అంతమొందిస్తారు. పసివాడిగా ఉన్న హీరో తప్పించుకుంటాడు. తర్వాత తిరిగొచ్చి అందరినీ అంతమొందిస్తాడు.యాక్షన్,లవ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు హీరోయిన్ పూజా హెగ్డే మరింత అట్రాక్షన్‌ తీసుకొచ్చింది.

- Advertisement -