తెలంగాణ దేశానికే మార్గదర్శి : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

127
palla
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి నాంపల్లిలోని రైతు బంధు సమితి కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.

ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం దిశగా గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ పచ్చని తెలంగాణ దిశగా ముందుకు వెళుతుందన్నారు. తెలంగాణ దేశానికే మార్గదర్శిగా నిలిచిందన్నారు. హరితహరం స్పూర్తితో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నన్ను భాగస్వామ్యులను చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -