ఆ నటి వ్యాపారంపై పుకార్లు!

38
- Advertisement -

ఆమె ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్. త్రివిక్రమ్ – వెంకీ కలయికలో వచ్చిన మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ సినిమాల ద్వారా నటిగా మంచి పేరు తెచ్చుకుంది. పైగా ఆ మధ్య ‘మా అసోసియేషన్’ ఎన్నికల్లో హడావుడి చేసి ఫైర్ బ్రాండ్ అని కూడా ముద్ర పడింది. అప్పట్లో సైడ్ క్యారెక్టర్లకు అయితే ఆమె కేరాఫ్ అడ్రస్. కానీ, ప్రస్తుతం ఆమెకు అవకాశాలు తగ్గాయి. చిన్నాచితకా మూవీస్ ను నమ్ముకుంది. ఇప్పుడు వాటిల్లోనూ ఆమెకు ఛాన్స్ లు రావడం లేదు. అందుకే, మళ్లీ సైడ్ క్యారెక్టర్స్ తో ఫేమస్ అవ్వాలని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాదు అని ఫిక్స్ అయిపోయింది.

మధ్యలో సొంత డబ్బు పెట్టి ఒకటి రెండు బిజినెస్ లు పెట్టినా కలిసి రాలేదు. మరోపక్క ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వని పరిస్థితి. దాంతో, ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తాజాగా ఓ బిజినెస్ పెట్టింది. చూడటానికి చాలా డీసెంట్ గా కనిపించే ఆ నటి.. ఇలాంటి బిజినెస్ చేస్తోందని ఎవ్వరూ ఊహించరు. ప్రస్తుతం ఆమె ఓ లేడీస్ హాస్టల్ నడుపుతుంది. ఆ హాస్టల్ లో సినిమా వాళ్ళు కూడా ఉంటున్నారు. కొత్తగా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టె అమ్మాయిలలో కొందరు అక్కడే ఉంటున్నారు.

ఇప్పుడు ఈ హాస్టల్ గురించి ఓ రూమర్ వినిపిస్తోంది. అక్కడ అమ్మాయిలు మందు కొట్టడం అనేది, టీ తాగడం అన్నంత కామన్ పాయింట్ అని టాక్. పైగా ఆ హాస్టల్ క్యాంటీన్ లోనే మందు ను మజ్జిగ లా అమ్మేస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ నటి ఈ హాస్టల్ కి ఎప్పుడు వెళ్ళింది లేదు. కానీ, పెట్టుబడి పెట్టింది మాత్రం ఈమెనే. మెయింటెన్స్ మొత్తం ఈమె గారి పర్సనల్ మేనేజర్ చూసుకుంటాడు. ఆమె ఓ మేనేజర్ కమ్ ఫైనాన్సియర్ తో ఆ హాస్టల్ తాలూకు అవసరాలన్నీ తీరుస్తోంది. ప్రస్తుతం ఆ నటి వ్యాపారం ఫుల్ లాభాల్లో సాగుతుంది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:మోడీ రాక.. రాజకీయం కోసమేనా?

- Advertisement -