కళ్యాణలక్ష్మీ పథకం..రూ.675 కోట్లు విడుదల

215
gangula
- Advertisement -

సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “కళ్యాణలక్ష్మి పథకము’’ పై మంత్రి గంగుల కమలాకర్‌ బి.సి సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. బి.సి మరియు ఈ.బి.సి వధువులకు రూ. 675 కోట్లు విడుదల చేశారని బి.సి. సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు.

ఈ విడుదలైన బడ్జెట్ ను 2016-17 నుండి 2018-19 వరకు ఉన్న బకాయిలకై రూ.44.11 కోట్లు, 2019-2020 మరియు 2020-2021 లబ్దిదారులకై రూ.591.35 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగినది.

రెవెన్యూ డివిజినల్ అధికారులు ఈ నిధులను త్వరితగతిన అర్హులైన వారికి విడుదల చేయాలని కోరారు. ఇప్పటి నుండి గౌరవ మంత్రి వర్యులు మరియు ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు, రెవెన్యూ డివిజన్ల వారీగా ఈ పథకము యొక్క ప్రగతిని సమీక్షిస్తారని మంత్రి తెలిపారు.

- Advertisement -