మౌనిక కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం..

589
hyderabad metro
- Advertisement -

అమీర్ పేట మెట్రో స్టేషన్‌ ప్రమాద ఘటనపై విచారణ వ్యక్తం చేశారు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌. ప్రమాదవశాత్తు పెచ్చులూడి పడి ప్రాణాలు కోల్పోయిన మౌనిక కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. అమీర్ పేట మెట్రో ఘటనపై రాష్ట్రప్రభుత్వం సీరియస్ అయిందని… నిపుణులు క్షుణ్ణంగా పరిశోధించిన తర్వాత ప్రమాదానికి గల కారణాలపై వివరాలు వెల్లడిస్తామన్నారు.

మంత్రి కేటీఆర్ సలహా ప్రకారం బాధిత కుటుంబానికి తగిన పరిహారం చెల్లించాలని ఎల్అండ్ టీకి సూచించామని చెప్పారు. ఎల్ అండ్ టీ యాజమాన్యం బాధిత కుటుంబసభ్యులతో చర్చలు జరిపిందని…బాధిత కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం చెల్లించే ఒప్పందంపై ఎల్ అండ్ టీ సంతకం చేసిందని చెప్పారు.

ప్రమాదం ఒక విచిత్రమైనదే అయినప్పటికీ చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరముందన్నారు. అన్ని స్టేషన్ల నిర్మాణాలు, సౌకర్యాలను సూక్ష్మంగా తనిఖీ చేయాలని ప్రయాణీకుల భద్రతకు అన్ని సమయాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

- Advertisement -