శ్రీవారికి కాసుల వర్షం..

126
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఆగస్టులో దాదాపు 22 లక్షల 80 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా హుండి ద్వారా ఆదాయం రూ. 140 కోట్లు సమకూరింది. దాదాపు 10లక్షల 79వేల 900మంది భక్తులు తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

కరోనా ప్రభావంతో రెండేళ్ల పాటూ తిరుమలకు భక్తుల రద్దీ తగ్గగా ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో పెద్ద ఎత్తున తిరుమలకు తరలివస్తున్నారు భక్తులు. దీంతో ప్రతి నెలా హుండీ ఆదాయం భారీగా పెరిగిపోతోంది. ఒక్కోరోజుకు రూ. కోట్ల వరకు వస్తుండగా సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్నిఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

- Advertisement -