బర్డ్‌ ట్రస్టుకు రూ.10 లక్ష‌లు విరాళం

88
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక హైదరాబాదుకు చెందిన న్యాయవాది శ్రీ శ్రీనివాసులు శుక్రవారం బ‌ర్డ్ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం ఇచ్చారు.

తిరుమలలోని ఈవో బంగ్లాలో శుక్రవారం ఉద‌యం దాత ఈ విరాళం చెక్కును ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డికి అందచేశారు. దాత గత నెలలో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం అందించారు. ఇందుకు గాను దాతను ఈవో అభినందించారు.

Also Read:Ind Vs WI:భారత్ 438 ఆలౌట్

- Advertisement -