ఆస్కార్‌తో హైదరాబాద్‌లో ఆర్ఆర్ఆర్ టీం..

38
- Advertisement -

తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు దర్శకధీరుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాతో మ్యాజిక్ చేసిన జక్కన్న సినీ పరిశ్రమలో అత్యున్నత పురస్కారమైన ఆస్కార్‌ను అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్‌కి ఆస్కార్ దక్కగా ప్రపంచమంతా ఫిదా అయిపోయింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మల్టీస్టార్రర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాధారణ పొందింది.

తాజాగా ఆస్కార్ అవార్డుతో రాజమౌళి, కీరవాణి హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఉదయం హైదరాబాద్ లో దిగిన RRR టీంకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాజమౌళి ‘జై హింద్’ అనే ఒక్క మాటతో అందరి మనసులను దోచుకున్నాడు.

ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించిన RRR లోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కి ఎంపిక అయ్యింది. పోటీ బరిలో వరల్డ్ టాప్ స్టార్స్ ఉన్నా, వారందర్ని గెలిచి నాటు నాటుకి ఆస్కార్ అందుకొని హిస్టరీ క్రియేట్ చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -