భారత్ – ఆసీస్ తొలి వన్డే..

24
- Advertisement -

ఇవాళ ముంబై వాంఖడే వేదికగా భారత్ -ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరగనుంది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి మ్యాచ్‌కు భారత సారథి రోహిత్‌ శర్మ దూరంకాగా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకున్న భారత్‌.. అదే ఊపులో వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని చూస్తున్నది. చివరి రెండు టెస్టుల్లో జట్టును నడిపించిన స్మిత్‌ వన్డేల్లోనూ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. గాయాల నుంచి కోలకున్న గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, డేవిడ్‌ వార్నర్‌, మిషెల్‌ మార్ష్‌ రాకతో ఆ జట్టు పటిష్టంగా మారింది.

తుది జట్లు (అంచనా)

భారత్‌: పాండ్యా (కెప్టెన్‌), గిల్‌, ఇషాన్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, రాహుల్‌, జడేజా, అక్షర్‌/సుందర్‌, శార్దూల్‌, సిరాజ్‌, షమీ/ఉమ్రాన్‌.

ఆస్ట్రేలియా: స్మిత్‌ (కెప్టెన్‌), వార్నర్‌, హెడ్‌, లబుషేన్‌, మార్ష్‌/స్టొయినిస్‌, మ్యాక్స్‌వెల్‌, కారీ, గ్రీన్‌, స్టార్క్‌, జంపా, ఎల్లిస్‌

ఇవి కూడా చదవండి..

- Advertisement -